కుక్క దాడిలో ఎనిమిది మందికి గాయాలు

ABN , First Publish Date - 2021-10-17T04:48:28+05:30 IST

నర్సాపూర్‌లో శుక్రవారం దసరా నవరాత్రుల సందర్భంగా హిందువాహిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రావణదహనం కార్యక్రమానికి వచ్చిన పలువురిపై ఓ కుక్క దాడి చేయడంతో ఎనిమిది మందికి గాయలయ్యాయి.

కుక్క దాడిలో ఎనిమిది మందికి గాయాలు

నర్సాపూర్‌, అక్టోబర 16: నర్సాపూర్‌లో శుక్రవారం దసరా నవరాత్రుల సందర్భంగా హిందువాహిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రావణదహనం కార్యక్రమానికి వచ్చిన పలువురిపై ఓ కుక్క దాడి చేయడంతో ఎనిమిది మందికి గాయలయ్యాయి. పట్టణానికి చెందిన నాగరాజు, రాజు, సురేష్‌, నవీన్‌, బంటుతో పాటు మరో ముగ్గురు ధర్మశాల వద్ద రావణదహనం చూసేందుకు వచ్చారు. అదే సమయంలో ఓ కుక్క అక్కడ నిలబడిన గుంపులోకి ఒక్కసారిగా చొరబడి పలువురిని కరవడంతో వచ్చినవారు భయభ్రాంతులకు గురయ్యారు. కుక్క దాడిలో గాయపడ్డ 8 మందిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.  గాయపడ్డ వారిని మున్సిపల్‌ చైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌తో పాటు పలువురు ఆసుపత్రికి వెళ్లి పరిశీలించారు. నర్సాపూర్‌ పట్టణంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2021-10-17T04:48:28+05:30 IST