Jharkhand: Goods Train కింద పడి 80 గొర్రెల మృతి

ABN , First Publish Date - 2021-10-12T13:33:49+05:30 IST

జార్ఖండ్ రాష్ట్రంలో పట్టాలు దాటుతున్న 80 గొర్రెలు వేగంగా వస్తున్న గూడ్సు రైలు కింద పడి మరణించాయి...

Jharkhand: Goods Train కింద పడి 80 గొర్రెల మృతి

రాంచీ (జార్ఖండ్): జార్ఖండ్ రాష్ట్రంలో పట్టాలు దాటుతున్న 80 గొర్రెలు వేగంగా వస్తున్న గూడ్సు రైలు కింద పడి మరణించాయి.పాలము జిల్లా కోషియారా గ్రామం వద్ద రైలు ట్రాక్ సమీపంలో కాపరులు గొర్రెలను కాస్తున్నారు. గొర్రెల మంద రైలు పట్టాలు దాటుతుండగా అంతలో వేగంగా  గూడ్సు రైలు దూసుకువచ్చింది. గూడ్సు రైలు శబ్ధం విన్న గొర్రెలు పరుగెత్తాయి. గూడ్సు రైలు చక్రాల కింద గొర్రెలు నలిగి మరణించాయి. రైలు పట్టాలు రక్తసిక్తమైనాయి. పట్టాలపై చెల్లాచెదురుగా గొర్రెల కళేబరాలు పడి ఉన్నాయి. 


రైలు పట్టాలపై గొర్రెల కళేబరాలను తొలగిస్తున్నామని హుస్సేనాబాద్ సబ్ డివిజనల్ అధికారి పూజ్య ప్రకాష్ చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన గొర్రెలను పశువుల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కలత చెందిన కాపరులు మిగిలిన గొర్రెలను తీసుకొని పట్టాలకు దూరంగా పొలాల్లోకి వెళ్లారు.


Updated Date - 2021-10-12T13:33:49+05:30 IST