Mumbaiకు బయలుదేరిన ఏక్‌నాథ్ షిండే...బీజేపీకి మద్ధతు ఇస్తూ లేఖ

ABN , First Publish Date - 2022-06-30T18:10:45+05:30 IST

శివసేన తిరుగుబాటు నాయకుడు ఏకనాథ్ షిండే గురువారం గోవా నుంచి ముంబయికు బయలుదేరారు....

Mumbaiకు బయలుదేరిన ఏక్‌నాథ్ షిండే...బీజేపీకి మద్ధతు ఇస్తూ లేఖ

 పనాజీ(గోవా): శివసేన తిరుగుబాటు నాయకుడు ఏకనాథ్ షిండే గురువారం గోవా నుంచి ముంబయికు బయలుదేరారు. తిరుగుబాటు శాసనసభ్యులతో పనాజీలోని తాజ్ హోటల్ లో సమావేశమైన షిండే వారితో చర్చించి ముంబయికు బయలుదేరారు.బీజేపీ నేత ఫడణవీస్‌,మహారాష్ట్ర గవర్నర్ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీలను కలవడానికి ఏకనాథ్ షిండే ముంబైకి వస్తున్నారు.ముంబైలో బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చలు జరపనున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా ఫడణవీస్, షిండేలు ఇద్దరూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలవనున్నారు.


ఏక్‌నాథ్ షిండే గురువారం బీజేపీతో సమావేశానికి మద్దతు లేఖను తీసుకెళ్లనున్నట్లు రెబల్ ఎమ్మెల్యేలు చెప్పారు. ఏక్‌నాథ్ షిండే గోవా నుంచి ముంబైకి వెళ్లే సమయంలో సేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతు లేఖను తీసుకు వస్తున్నారని బీజేపీ వర్గాలు వివరించాయి.


Updated Date - 2022-06-30T18:10:45+05:30 IST