కోడలిని తీసుకొచ్చేందుకు వెళ్లిన అత్తపై దారుణం.. చితక్కొట్టిన కోడలి తరఫు బంధువులు ఎంత పని చేశారంటే..

ABN , First Publish Date - 2022-02-28T05:47:05+05:30 IST

చాలా రోజుల నుంచి పుట్టింట్లోనే ఉండిపోయిన కోడలిని తీసుకొచ్చేందుకు ఒక మహిళ వెళ్లింది. కోడలికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో కోడలి బంధువులతో వాగ్వాదం మొదలైంది. దీంతో వారు ఈమెపై దాడికి దిగారు. ఇద్దరు మహిళలు ఈమెను చితక్కొట్టారు. అనంతరం ఆమె బట్టలూడదీసి...

కోడలిని తీసుకొచ్చేందుకు వెళ్లిన అత్తపై దారుణం.. చితక్కొట్టిన కోడలి తరఫు బంధువులు ఎంత పని చేశారంటే..

చాలా రోజుల నుంచి పుట్టింట్లోనే ఉండిపోయిన కోడలిని తీసుకొచ్చేందుకు ఒక మహిళ వెళ్లింది. కోడలికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో కోడలి బంధువులతో వాగ్వాదం మొదలైంది. దీంతో వారు ఈమెపై దాడికి దిగారు. ఇద్దరు మహిళలు ఈమెను చితక్కొట్టారు. అనంతరం ఆమె బట్టలూడదీసి జననాంగంపై కారం చల్లారు. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా కమతై గ్రామానికి చెందిన ఓ మధ్యవయస్కురాలైన మహిళ తన కోడలి పుట్టింటికి వెళ్లింది. కోడలికి నచ్చ చెప్పి ఇంటికి తీసుకురావాలనుకుంది. ఆ క్రమంలో కోడలి తరఫు బంధువులతో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో వారు ఈమెపై దాడికి తెగబడ్డారు. ఇద్దరు మహిళలు ఈమెను చితక్కొట్టారు.. అనంతరం ఆమె బట్టలూడదీసి జననాంగంపై కారం చల్లారు.


ఆ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో పోలీసుల వరకు వెళ్లడంతో వారు రంగంలోకి దిగారు. బాధిత మహిళ నుంచి స్టేట్‌మెంట్ తీసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, ఈ వీడియో తీసిన వ్యక్తికోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2022-02-28T05:47:05+05:30 IST