వయోవృద్ధులను గౌరవించాలి

ABN , First Publish Date - 2022-10-01T05:36:51+05:30 IST

ప్రతి ఒక్కరూ వయో వృద్ధులను గౌరవించాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అన్నారు.

వయోవృద్ధులను గౌరవించాలి
జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌), సెప్టెంబరు 30:ప్రతి ఒక్కరూ వయో వృద్ధులను గౌరవించాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా మహిళా, దివ్యాంగుల, శిశు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి, మాట్లాడారు. వృద్ధుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వృద్ధుల రక్షణకు, పోషణకు చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలని ఆదేశించారు. వయోవృద్ధులు ఏదైనా సహాయం కోసం 14567 హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు కాల్‌ చేయాలన్నారు. వృద్ధుల కోసం ఆటల పోటీలు, సాంస్కృతిక కార్య కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ, సీడీపీవోలు శ్రీజ, చంద్రిక, హుస్సెన్‌, చంద్రశేఖర్‌, రవికుమార్‌, వినోద్‌కుమార్‌, రామచంద్రారెడ్డి, విద్యాసాగర్‌, భాస్కరాచారి, హమీద్‌ఖాన్‌, సఖీ కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-01T05:36:51+05:30 IST