రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ను పాటించాల్సిందే
ABN , First Publish Date - 2020-11-26T22:24:26+05:30 IST
జీహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా నిర్వహించే ఇంటింటి ప్రచారం, రోడ్షోలు, ర్యాలీలు తదితర ప్రచార కార్యక్రమాల్లో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు, కార్యకర్తలు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన కోడ్ నిబంధనలు పాటించాల్సిందేనని ఎన్నికల
హైదరాబాద్: జీహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా నిర్వహించే ఇంటింటి ప్రచారం, రోడ్షోలు, ర్యాలీలు తదితర ప్రచార కార్యక్రమాల్లో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు, కార్యకర్తలు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన కోడ్ నిబంధనలు పాటించాల్సిందేనని ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. పలు పార్టీలు ఎన్నికల సంఘం జారీ చేసిన కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించరాదని ఆదేశించింది. నిబంధనలు పాటించాలని సూచిస్తూ ఆదేశాలు జారీచేసింది. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది.
అన్నిపార్టీల అభ్యర్ధులు, వారి కార్యకర్తలు ఎన్నికల ప్రచారం సందర్భంగా తప్పని సరిగా ముఖానికి మాస్క్ ధరించాలి. అలాగే శానిటైజర్లను వినియోగిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించింది. ఇంటింటి ప్రచారానికి వెళ్లినప్పుడు అభ్యర్ధితో పాటు ఐదుగురు మాత్రమే వెళ్లాలని పేర్కొంది. ఇతరులు ప్రచారంలో పాల్గొంటే తప్పని సరిగా ఫేస్మాస్క్ ధరించాలన్నారు.
అలాగే తప్పని సరిగా శానిటైజర్ వినియోగిస్తూ భౌతిక దూరం పాటించాలన్నారు. రోడ్షోలు, ర్యాలీలు నిర్వహించే సమయంలోనూ తప్పని సరిగా ఫేస్మాస్క్లను ప్రతి ఒక్కరూ ధరించేలా చూడాలి. చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి. సమావేశాలు, బహిరంగ సభల్లోనూ భౌతిక దూరం తప్పని సరి అని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.