దురుద్దేశంతోనే ఎన్నికల షెడ్యూల్
ABN , First Publish Date - 2021-01-24T05:45:07+05:30 IST
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అప్రతి ష్టపాలు చేసేందుకే ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని ఎమ్మెల్సీ పోతుల సునీత ఆరోపించారు.
ఎమ్మెల్సీ పోతుల సునీత
ఒంగోలు(కలెక్టరేట్), జనవరి 23 : రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అప్రతి ష్టపాలు చేసేందుకే ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని ఎమ్మెల్సీ పోతుల సునీత ఆరోపించారు. శనివారం ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమా వేశంలో ఆమె మాట్లాడుతూ మూడేళ్ళ క్రితం జరగాల్సిన పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసుకుంటూ వచ్చారన్నారు. గత ఏడాది మార్చిలో కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల కమిషన్, ఇప్పుడు కరోనా కేసులు తగ్గకుండానే మరలా ఎన్నికలు నిర్వహిస్తామంటూ షె డ్యూల్ విడుదల చేయడం విచిత్రంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం కరో నా వ్యాక్సినేషన్ జరుగుతున్న తరుణంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించాలని చూడటం దారుణంగా ఉందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన విధంగానే ఎన్నికల కమిషన్ నడుచుకుంటోందని ఆమె ఆరోపించారు.