ఆపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక
ABN , First Publish Date - 2021-03-08T05:15:56+05:30 IST
ఆపస్ (ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వెంకట్రామిరెడ్డి, నరసింహులు ఎన్నికయ్యారు. కడప నగరం విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఆపస్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది.
కడప(ఎడ్యుకేషన్), మార్చి 7: ఆపస్ (ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వెంకట్రామిరెడ్డి, నరసింహులు ఎన్నికయ్యారు. కడప నగరం విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఆపస్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేశారు. ముందుగా జరిగిన సమావేశంలో ఆపస్ ఎన్నికల అధికారి లక్ష్మినారాయణరెడ్డి, రాష్ట్ర కోశాధికారి రామాంజనేయప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కారానికి సంఘ నాయకులతో పాటు కార్యకర్తలు ముందుండాలని పిలుపునిచ్చారు. కాగా జిల్లా కోశాధికారిగా శ్రీనివాసులు, గౌరవాధ్యక్షుడిగా బాలానాయుడు, ఉపాధ్యక్షులుగా నాగమునీశ్వర్రెడ్డి, రామక్రిష్ణారెడ్డి, రమణయ్య, చంద్రమోహన్, భాస్కర్రెడ్డి, కార్యదర్శులుగా చెన్నయ్య, నాగరాజ, సుధాకర్రెడ్డి, గంగన్న, శ్రీనివాసులను నియమించారు.