జాతీయవాదులకు కుటుంబవాదులకు మధ్యే ఎన్నికలు: మోదీ

ABN , First Publish Date - 2022-02-27T21:04:59+05:30 IST

గోరఖ్‌పూర్‌లో తాము ఎయిమ్స్ నిర్మించాం. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందిస్తున్నాం. అది కూడా వారి మాతృభాషలోనే అందిస్తున్నాం. చాలా కాలం క్రితం యూపీలో అతి తక్కువ కాలంలో 9 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన నేను స్వయంగా చేశాను..

జాతీయవాదులకు కుటుంబవాదులకు మధ్యే ఎన్నికలు: మోదీ

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జాతీయవాదులకు కుటుంబావాదులకు మధ్యే జరుగుతున్నాయని బీజేపీని ఎస్సీని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని దోరియాలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఎస్పీ అధికారంలో ఉండగా ప్రజలను పట్టించుకోలేదని అన్న మోదీ.. వైద్య సదుపాయాలు లేక ఎంతో మంది బ్రెయిన్ ఫీవర్‌తో మరణించారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 18 మెడికల్ కాలేజీలు నిర్మించిందని, మరో 20 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయని అన్నారు.


‘‘గోరఖ్‌పూర్‌లో తాము ఎయిమ్స్ నిర్మించాం. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందిస్తున్నాం. అది కూడా వారి మాతృభాషలోనే అందిస్తున్నాం. చాలా కాలం క్రితం యూపీలో అతి తక్కువ కాలంలో 9 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన నేను స్వయంగా చేశాను. అందుకో దోరియాలో నిర్మించిన మహర్షి దేవ్రహ బాబా ఆటోనామస్ స్టేట్ మెడికల్ కాలేజీ ఒకటి. ఇంతకు ముందు ప్రభుత్వం ఈ పని ఎందుకు చేయలేదు? ఎందుకంటే వారికి కుటుంబం మాత్రమే ముఖ్యం. మేము దేశం కోసం పని చేస్తాం కాబట్టే ప్రజావసరాలను గుర్తించి పని చేస్తున్నాం’’ అని మోదీ అన్నారు.

Updated Date - 2022-02-27T21:04:59+05:30 IST