ముగిసిన ఎన్నికలు
ABN , First Publish Date - 2021-10-27T05:20:53+05:30 IST
బనగానపల్లె, అవుకు మండలాల్లో గొర్రెల పెంపకందారుల సహకారసంఘం ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి.
బనగానపల్ల్లె, అక్టోబరు 26: బనగానపల్లె, అవుకు మండలాల్లో గొర్రెల పెంపకందారుల సహకారసంఘం ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. బనగానపల్లె మండలంలోని రామతీర్థం, అవుకు మండలం సంగపట్నం, చెర్లోపల్లె గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించారు. రామతీర్థం సహకారసంఘం అధ్యక్షుడిగా యాతం బాలకృష్ణ, అవుకు మండలం చెర్లోపల్లె గ్రామ సంఘం అధ్యక్షుడిగా మద్దిరాల పక్కీర, సంగపట్నం సంఘం అధ్యక్షుడిగా రామసుబ్బ య్య యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బనగానపల్లె పశువైద్యసహాయ సంచాలకుడు డాక్టర్ మారుతి సకారం ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు.