రెండు జడ్పీటీసీ, 39 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

ABN , First Publish Date - 2021-10-27T07:11:08+05:30 IST

రెండు జడ్పీటీసీ , 39 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.

రెండు జడ్పీటీసీ, 39 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

ఏర్పాట్లు పూర్తి చేశాం: జడ్పీ సీఈవో


చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 26: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాలో ఖాళీగా ఉన్న రెండు జడ్పీటీసీ (బంగారుపాళ్యం, కలకడ), 39 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. 191504 మంది ఓటర్ల కోసం 225 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామన్నారు. త్వరలోనే మైక్రో అబ్జర్వర్ల నియామకాలు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. 

Updated Date - 2021-10-27T07:11:08+05:30 IST