APలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

ABN , First Publish Date - 2021-11-15T15:56:21+05:30 IST

అమరావతి: ఏపీలో నగరపాలక, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగింది.

APలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

అమరావతి: ఏపీలో నగరపాలక, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగింది. నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 353 స్థానాల్లో 28 వార్డులు ఏకగ్రీవం కాగా మిగతావాటికి పోలింగ్ నిర్వహించారు. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు సాగింది. మొత్తం 8 లక్షల 62వేల మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్ని స్థానాలకు కలిపి 1,206 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 


ఈ ఎన్నికల కోసం 908 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా 349 ప్రాంతాలను సున్నితమైనవిగా, 239 కేంద్రాలను అతి సున్నితమైనవిగా గుర్తించారు. 626 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల అధికారులు ఆదేశించారు.



Updated Date - 2021-11-15T15:56:21+05:30 IST