త్వరలోనే టౌన్ సర్వీసు బస్సులు
ABN , First Publish Date - 2022-01-23T03:32:51+05:30 IST
వెంకటగిరి పట్టణంలో త్వరలోనే ఎలక్ర్టికల్ బస్సులు తిరుగుతాయని కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి అన్నారు.
వెంకటగిరి(టౌన్), జనవరి 22: వెంకటగిరి పట్టణంలో త్వరలోనే ఎలక్ర్టికల్ బస్సులు తిరుగుతాయని కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఆయన నివాసంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రజల సౌకర్యార్థం రెండు ఎలక్ర్టికల్ బస్సులు టౌన్ సర్వీసులుగా నడపనున్నామన్నారు. ఈ మధ్యనే మృతి చెందదిఇన బత్తినపట్ల రమణా రెడ్డి, షేక్ నబీసా కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జిల్లా గ్రంధాలయ చైర్మన్ దొంతు శారద, డిల్లీబాబు, తోట గణేస్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.