విశాఖలో మధ్యాహ్నం 3 గంటల వరకే దుకాణాలు

ABN , First Publish Date - 2021-04-24T04:52:46+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విశాఖ ఎలక్ర్టికల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

విశాఖలో మధ్యాహ్నం 3 గంటల వరకే దుకాణాలు

ఎలక్ట్రికల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రకటన

వినియోగదారులు గమనించాలని విన్నపం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 23: కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విశాఖ ఎలక్ర్టికల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌  కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి దుకాణాలు తెరిచి ఉండే సమయాల్లో  మార్పు చేసినట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు మట్టపల్లి హనుమంతరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇక నుంచి ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే విశాఖలోని అన్ని ఎలక్ర్టికల్‌ షాపులు పనిచేస్తాయని తెలిపారు.


ఆదివారం ఎప్పటిలా దుకాణాలు మూసిఉంటాయని చెప్పారు. కరోనా కారణంగా నగరవాసుల సంక్షేమాన్ని, దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పనివేళల్లో మార్పు చేసినట్లు తెలిపారు. దుకాణాలకు వచ్చే కొనుగోలుదారులు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-04-24T04:52:46+05:30 IST