విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-09-24T05:48:20+05:30 IST

విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలి

విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలి
మాట్లాడుతున్న ఎంపీపీ విజయలక్ష్మి

చేవెళ్ల, సెప్టెంబర్‌ 23: విద్యుత్‌ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చేవెళ్ల మండల ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఎంపీపీ ఎం.విజయలక్ష్మి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశంలో పలువురు సర్పంచులు ఎంపీటీసీలు మాట్లాడుతూ.. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం వలన సమస్యలు అధికమవుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన ఎంపీపీ విధుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. మండల సమావేశానికి డుమ్మాకొట్టిన అధికారులపై కలెక్టర్‌కు నివేదిక పంపించాలని ఎంపీడీవో రాజ్‌కుమార్‌ను ఆదేశించారు. మల్లారెడ్డిగూడ గ్రామానికి ప్రత్యేకంగా రేషన్‌ డీలర్‌ను మంజూరు చేయాలని సర్పంచ్‌ మోహన్‌రెడ్డి అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైస్‌ఎంపీపీ కర్నె శివప్రసాద్‌, ఎంపీడీవో రాజ్‌కుమార్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంఈవో ఆక్బర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-24T05:48:20+05:30 IST