కేంద్రం విద్యుత్ సవరణ బిల్లును నిలిపివేయాలి
ABN , First Publish Date - 2022-08-08T05:30:00+05:30 IST
కేంద్రం విద్యుత్ సవరణ బిల్లును నిలిపివేయాలి
వికారాబాద్, ఆగస్టు 8: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును నిలిపివేయాలని విద్యుత్ సంఘాల జేఏసీ అధ్వర్యంలో సోమవారం విద్యు త్ కార్యలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ పిలుపు మేరకు విధులను బహిష్కరించామన్నారు. బిల్లు అమల్లోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ రాదన్నారు. ధరలు పెరుగుతాయన్నారు. ప్రైవేట్ ఆపరేటర్ల బిల్లును ప్రధానమంత్రి రద్దుచేయాలని డిమాండ్ చేశారు. సంజీవ్, రాంచంద్రయ్య, నీలకంఠరావు, మధుకర్, శ్రీనివాస్, రుక్మయ్య పాల్గొన్నారు.