విద్యుత్‌ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-09T05:42:22+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఎలక్ర్టీసిటీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ వెంకన్న డిమాండ్‌ చేశారు. జిల్లాకేంద్రంలోని విద్యుత్‌ కార్యాలయంలో సోమవారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.

విద్యుత్‌ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలి
నిరసన సభలో మాట్లాడుతున్న జేఏసీ చైర్మన్‌ వెంకన్న

సూర్యాపేటటౌన్‌, ఆగస్టు 8: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఎలక్ర్టీసిటీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ వెంకన్న డిమాండ్‌ చేశారు. జిల్లాకేంద్రంలోని విద్యుత్‌ కార్యాలయంలో సోమవారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరంచేసే కుట్రలు చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్‌ సవరణ బిల్లును విద్యుత్‌ సంస్థలన్నీ వ్యతిరేకిస్తున్నాయని అయినా కేంద్ర ప్రభుత్వం మెండిగా బిల్లును ప్రవేశపెడితే నిరవదిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ పాల్‌రాజ్‌, డీఈలు శ్రీనివాస్‌, ఏడీ లు వినోద్‌కుమార్‌, శ్రీనివాస్‌, ఇందిర, నాయకులు యాదగిరి నాయుడు, మల్లికార్జున్‌, బా లకృష్ణ, భాస్కర్‌, వెంకటనారాయణ, దయాకర్‌రెడ్డి, రషీద్‌, లింగయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T05:42:22+05:30 IST