విద్యుత్‌ బిల్లు ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-09T05:36:48+05:30 IST

: కేంద్ర ప్రభుత్య విద్యుత్‌ సవరణ బిల్లు - 2022ను ఉప ఉపసంహరించుకోవాలని విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ బిల్లు ఉపసంహరించుకోవాలి
నినాదాలు చేస్తున్న విద్యుత్‌ ఉద్యోగ జేఏసీ నాయకులు

- విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా

గణేశ్‌నగర్‌, ఆగస్టు 8: కేంద్ర ప్రభుత్య విద్యుత్‌ సవరణ బిల్లు - 2022ను ఉప ఉపసంహరించుకోవాలని విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. అంతవరకూ తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌సీ కార్యాలయం ఎదుట  విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్‌ జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్‌ చట్టాల సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించామన్నారు. ఈ బిల్లుపై తుది నివేదిక వచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని, ప్రస్తుతం తాత్కాలికంగా  నిరసన కార్యక్రమాలు వాయిదా వేశామని తేలియజేశారు. కార్యక్యమంలో కె అంజయ్య, ఎస్‌ నరేందర్‌, కె శ్రీనివాస్‌, జిల్లా ఎస్‌సీ గంగాధర్‌,  డివిజనల్‌ ఇంజనీర్లు  ఎన్‌ అంజయ్య, జి రఘు, వీరయ్య, భాస్కర్‌, శ్రీనివాస్‌, యుగేందర్‌, సంపత్‌కుమార్‌, రమేశ్‌, స్వామి, జనార్దన్‌, కిరణ్‌, సుధీర్‌, ప్రకాష్‌, ఫారుఖ్‌, సుల్తాన్‌ రవి పాల్గొన్నారు.


Updated Date - 2022-08-09T05:36:48+05:30 IST