విద్యుత్‌ చార్జీలు తగ్గించేదాకా ఉద్యమం: శైలజానాథ్‌

ABN , First Publish Date - 2022-04-07T01:04:28+05:30 IST

విద్యుత్‌ చార్జీలు తగ్గించేదాకా పోరాటం సాగిస్తామని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ

విద్యుత్‌ చార్జీలు తగ్గించేదాకా ఉద్యమం: శైలజానాథ్‌

అనంతపురం: విద్యుత్‌ చార్జీలు తగ్గించేదాకా పోరాటం సాగిస్తామని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురంలో కాంగ్రెస్‌ పార్టీ బుధవారం నిరసన తెలిపింది. ఈ సందర్భంగా శైలజానాథ్‌ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఏపీ ప్రజలను లూఠీ చేస్తోందని విమర్శించారు. విద్యుత్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని కోరారు. రైతుల కోసం, ప్రజల కోసం ఉద్యమం చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు. అతిపెద్ద విద్యుత్‌ ఉద్యమం నడిపిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీకి ఉందని గుర్తు చేశారు. అరెస్టులు తమ పార్టీకి కొత్త కాదని, చార్జీలను తగ్గించేదాకా పోరాటం చేస్తామని శైలజానాథ్‌ హెచ్చరించారు.

Updated Date - 2022-04-07T01:04:28+05:30 IST