కొనసాగుతున్న విద్యుత్ ఉద్యోగుల సమ్మె
ABN , First Publish Date - 2022-02-03T15:47:26+05:30 IST
కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో పలు డిమాండ్లతో విద్యుత్ శాఖ ఉద్యోగులు చేపట్టిన సమ్మె బుధవారం కూడా కొనసాగింది. విద్యుత్ శాఖ ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటూ
పుదుచ్చేరి: కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో పలు డిమాండ్లతో విద్యుత్ శాఖ ఉద్యోగులు చేపట్టిన సమ్మె బుధవారం కూడా కొనసాగింది. విద్యుత్ శాఖ ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటూ మంగళవారం డీఎంకే, కాంగ్రెస్ తదితర మిత్రపక్షాలతో కలిసి విద్యుత్ శాఖ ఉద్యోగులు సమ్మెకు దిగారు. విద్యుత్ శాఖ మంత్రి నమశ్శివాయంతో జరిగిన చర్చలు ఫలించ లేదు. దీంతో రోడ్డుపై భైఠాయించి ప్ల కార్డులు ప్రదర్శించి తమ నిరసన వ్యక్తం చేశారు.