ప్రాథమిక పాఠశాలలు కొనసాగించాలి
ABN , First Publish Date - 2021-06-18T05:18:55+05:30 IST
ప్రాథమిక పాఠశాలలు కొనసాగించాలి
ప్రాథమిక పాఠశాలలు కొనసాగించాలి
రాజాం : జీవో నెం. 172ను రద్దుచేసి ప్రాఽథమిక పాఠశాలలు కొనసాగించాలని యూటీఎఫ్ రాజాం మండలశాఖ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆగూరు, కంచరాం, రాజీయ్యపేట గ్రామాల్లో పర్యటించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు రెడ్డి మోహన్రావు, మండలశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు జి.రమేష్, డి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించాలని ప్రజలకు వినతి పత్రాలు అందించారు.
- పోలాకి : ప్రభుత్వ నూతన విద్యా విధానం అమలుతో విద్యార్థులకు తీవ్ర నష్టం చేకూరుతుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చింతాడ దిలీప్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన కమిటీ సభ్యులతో కలిసి ఎంపీడీవో, ఎంఈవో, ఎంఆర్సీ అధికారులకు వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోవో నెం.172లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లక్ష్మణరావు, వల్లయ్యనాయుడు, యారబాటి రామారావు తదితరులు పాల్గొన్నారు.