విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం
ABN , First Publish Date - 2021-10-11T21:42:58+05:30 IST
ల్లా కోమరాడ మండలంలో మరోసారి ఏనుగు బీభత్సం సృష్టించింది. దుగ్గి గ్రామంలో ఏనుగు ఆవు
విజయనగరం: జిల్లా కోమరాడ మండలంలో మరోసారి ఏనుగు బీభత్సం సృష్టించింది. దుగ్గి గ్రామంలో ఏనుగు ఆవు దూడపై దాడిచేసి చంపేసింది. అర్ధరాత్రి వేళ ఏనుగులు ఊర్లోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏనుగులను గ్రామాలకు దూరంగా తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇంటి నుండి బయట అడుగుపెట్టాలంటే గ్రామస్తులు భయపడుతున్నారు. మరోవైపు గతంలో కూడా విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపులు హల్చల్ చేసిన ఘటనలు ఉన్నాయి.