తిరుమల ఘాట్లో మళ్లీ ఏనుగుల కలకలం
ABN , First Publish Date - 2022-06-27T07:50:59+05:30 IST
తిరుమల ఘాట్లో మళ్లీ ఏనుగుల కలకలం
తిరుమల, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): తిరుమల నుంచి తిరుపతికి చేరుకునే మొదటి ఘాట్లో మళ్లీ ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. గురువారం ఏనుగుల ఆర్చ్, ఏడో మైలు మధ్యలో ఏనుగుల గుంపు రోడ్డుకు అతిసమీపానికి రావడంతో వాహనదారులు భయబ్రాంతులకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో సుమారు 11 ఏనుగులు ఆదివారం సాయంత్రం రోడ్డు సమీపానికి వచ్చాయి. వీటిని చూసిన వాహనదారులు హడలిపోయారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్, విజిలెన్స్ అఽధికారులు అక్కడికి చేరుకుని ఏనుగులు అడవిలోకి వెళ్లేలా శబ్దాలు చేశారు. ఏనుగుల గుంపును పూర్తిగా దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.