tamilnadu రథోత్సవంలో అపశ్రుతి...కరెంటు వైరు తగిలి 11మంది దుర్మరణం

ABN , First Publish Date - 2022-04-27T13:24:39+05:30 IST

తమిళనాడు రాష్ట్రంలో బుధవారం జరిగిన రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది....

tamilnadu రథోత్సవంలో అపశ్రుతి...కరెంటు వైరు తగిలి 11మంది దుర్మరణం

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో జరిగిన రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది తంజావూరు జిల్లా కలిమేడులో ఆలయ రథానికి హైటెన్షన్ కరెంటు తీగ తగిలి విద్యుదాఘాతానికి గురై 11 మంది మరణించారు.భక్తులు ఆలయ రథాన్ని వీధి గుండా లాగుతుండగా విద్యుత్ తీగ అందులో చిక్కుకుంది. దీంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు చిన్నారులు సహా 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. కలిమేడు పట్టణంలో ఆలయ ఉత్సవాల సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. మంగళవారం రాత్రి 94వ అప్పర్ గురుపూజై (అయ్యప స్వామి పండుగ) జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సమీప ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.


ఈ ఘటనలో గాయపడిన మరికొంత మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఆలయ రథం నుంచి 50 మంది వ్యక్తులు దూరంగా ఉండటంతో భారీ ప్రాణనష్టం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 


Updated Date - 2022-04-27T13:24:39+05:30 IST