ఎల్లమ్మ రథోత్సవం

ABN , First Publish Date - 2022-07-07T16:08:31+05:30 IST

బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణఘట్టంలో చివరి అంకమైన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం సాయంత్రం

ఎల్లమ్మ రథోత్సవం

అంబరాన్నంటిన సంబురం 

కిక్కిరిసిన వీధులు

హైదరాబాద్/అమీర్‌పేట: బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణఘట్టంలో చివరి అంకమైన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం సాయంత్రం దేవాలయం నుంచి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన రథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ దంపతులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పురవీధుల గుండా ఈ రథయాత్ర కొనసాగింది. జిగేల్‌మనే లాంతర్ల వెలుగుల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. బాజాభజంత్రీలు, శివసత్తుల పూనకాలు, మహిళల కోలాటాలు, యువకుల నృత్యాలతో రథోత్సవం కనుల పండువగా కొనసాగింది. దారి పొడవునా భక్తులు నీరాజనాలు పలికారు. 

Updated Date - 2022-07-07T16:08:31+05:30 IST