పోరస్ ఫ్యాక్టరీ వద్ద కొనసాగుతున్న హైటెన్షన్
ABN , First Publish Date - 2022-04-14T16:05:14+05:30 IST
జిల్లాలోని అక్కిరెడ్డిగూడం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ ఎదుట హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.
ఏలూరు: జిల్లాలోని అక్కిరెడ్డిగూడం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ ఎదుట హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. గ్రామస్తులు ఫ్యాక్టరీ వద్ద చెట్లు, దుంగలను అక్కిరెడ్డిగూడెం రోడ్డుకు అడ్డంగా వేశారు. ఈ క్రమంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీని వెంటనే ఇక్కడి నుంచి తీసివేయాలి అని నినాదాలు చేశారు. రోడ్డుకు అడ్డంగా వేసిన దుంగలను గ్రామస్తులు తీయకపోవడంతో పోలీసులు వాటిని తొలగించారు.