ఏలూరులో అగ్నిప్రమాదంపై సీఎస్ ఆరా

ABN , First Publish Date - 2022-04-14T17:04:00+05:30 IST

జిల్లాలోని అక్కిరెడ్డిగూడెం ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఆరా తీశారు.

ఏలూరులో అగ్నిప్రమాదంపై సీఎస్ ఆరా

ఏలూరు: జిల్లాలోని అక్కిరెడ్డిగూడెం ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఆరా తీశారు. ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్‌తో సీఎస్ ఫోన్లో సంభాషించి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు సీఎస్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ప్రమాద సంఘటనపై వెంటనే పూర్తి దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను సీఎస్ డా‌.సమీర్ శర్మ ఆదేశించారు.

Updated Date - 2022-04-14T17:04:00+05:30 IST