AP: ద్వారకాతిరుమల టోల్గేట్ వద్ద సిబ్బంది దౌర్జన్యం
ABN , First Publish Date - 2022-04-15T19:32:32+05:30 IST
జిల్లాలోని ద్వారకాతిరుమల టోల్గేట్ వద్ద సిబ్బంది దౌర్జన్యం ప్రదర్శించారు.
ఏలూరు: జిల్లాలోని ద్వారకాతిరుమల టోల్గేట్ వద్ద సిబ్బంది దౌర్జన్యం ప్రదర్శించారు. ఒకే కారుకి రెండు చోట్ల టోల్ ఛార్జ్ వసూలు చేసేందుకు యత్నించారు. ఒక టోల్గేట్ వద్ద టికెట్ మరో టోల్గేట్ వద్ద చెల్లదంటూ వాహనదారులపై దుర్భాషలాడారు. టోల్గేట్ సిబ్బంది దౌర్జన్యంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.