Eluru: ప్రభుత్వ మద్యం దుకాణం సూపర్వైజర్పై దాడి
ABN , First Publish Date - 2022-04-18T15:01:55+05:30 IST
జిల్లాలోని లింగపాలెం మండలం రంగాపురంలో ప్రభుత్వ మద్యం దుకాణం సూపర్ వైజర్ బుద్దికోళ్ల అజయ్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.
ఏలూరు: జిల్లాలోని లింగపాలెం మండలం రంగాపురంలో ప్రభుత్వ మద్యం దుకాణం సూపర్ వైజర్ బుద్దికోళ్ల అజయ్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. గత రాత్రి మద్యం దుకాణం మూసివేసి స్వగ్రామం లింగపాలెం వెళుతుండగా మార్గ మధ్యలో అజయ్పై దుండగులు దాడికి పాల్పడ్డారు. నగదు లాక్కుని పరారయ్యారు. ప్రస్తుతం బాధితుడు అజయ్ చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.