ఏలూరులో పట్టపగలే దొంగతనం

ABN , First Publish Date - 2022-04-19T19:50:26+05:30 IST

జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం సూర్య చంద్రరావుపేటలో పట్టపగలు దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు.

ఏలూరులో పట్టపగలే దొంగతనం

ఏలూరు: జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం సూర్య చంద్రరావుపేటలో పట్టపగలు దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఓ ఇంట్లో ఎవరూ లేని  సమయంలో ఇద్దరు దొంగలు చొరబడి ఆరున్నర కాసుల బంగారు నగలను అపహరించారు. పారిపోతుండగా ఓ దొంగని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. మరో దొంగ బంగారంతో పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-19T19:50:26+05:30 IST