AP: లారీల నుండి దోపిడీ... నలుగురి అరెస్ట్

ABN , First Publish Date - 2022-04-19T14:14:57+05:30 IST

జిల్లాలోని కొయ్యలగూడెం మండలం కన్నాపురం వద్ద లారీలు నుండి దారిదోపిడికి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

AP: లారీల నుండి దోపిడీ... నలుగురి అరెస్ట్

ఏలూరు: జిల్లాలోని కొయ్యలగూడెం మండలం కన్నాపురం వద్ద  లారీల నుండి దారిదోపిడికి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్  చేశారు. ఖమ్మం నుండి విజయనగరం వెళుతున్న గొర్రెలలోడు వ్యాన్‌ను అటకాయించిన దుండగులు... ఐదు వేలు నగదు, 2.5 కాసుల బంగారు గొలుసు దోచుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కన్నాపురం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-04-19T14:14:57+05:30 IST