Eluru: పోరస్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య

ABN , First Publish Date - 2022-04-20T16:32:13+05:30 IST

జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ రసాయన పరిశ్రమ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది.

Eluru: పోరస్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య

ఏలూరు: జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ రసాయన పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో మరో 10 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఫ్యాక్టరీ ప్రమాద స్థలిలో నమూనాలు ఫోరెన్సిక్ బృందం సేకరించింది. పరిసర ప్రాంతంలో 14 రోజుల పాటు 144 సెక్షన్ అమలులోకి తీసుకువచ్చారు. కాగా ఫ్యాక్టరీని తొలగించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. 


Updated Date - 2022-04-20T16:32:13+05:30 IST