ఏలూరులో వ్యక్తి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2022-05-04T17:43:30+05:30 IST

జిల్లాలోని భీమడోలు పోలీసుల కస్టడీలో ఉన్న అప్పారావు(38)అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

ఏలూరులో వ్యక్తి అనుమానాస్పద మృతి

ఏలూరు: జిల్లాలోని భీమడోలు పోలీసుల కస్టడీలో ఉన్న అప్పారావు(38)అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అప్పారావుది లాకప్ డెత్‌గా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కొట్టి చంపారని బంధువులే ఆరోపిస్తున్నారు. లాకప్‌లోని బాత్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం  ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మూడు రోజుల క్రితం చైన్ స్నాచింగ్ కేసులో అప్పారావు పోలీసులకు పట్టుబడ్డాడు. 

Read more