Eluru: ఫేస్బుక్తో పరిచయం... రూ.2.50 లక్షలు స్వాహా
ABN , First Publish Date - 2022-05-27T17:34:03+05:30 IST
ఫేస్బుక్ పరిచయంతో ఓ యువకుడు రెండు లక్షలు పోగొట్టుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.
ఏలూరు: ఫేస్బుక్ పరిచయంతో ఓ యువకుడు రెండు లక్షలు పోగొట్టుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఉంగుటూరు మండలం చేబ్రోలులో ఫేస్బుక్ పరిచయంతో యువకుడి ఖాతాలో నుంచి రూ.2.50 లక్షలు స్వాహా అయ్యాయి. గణేష్ అనే యువకుడు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన ఓ యువతితో కొన్ని రోజులుగా మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో నెట్ బ్యాలెన్స్ కోసం యువతి ఖాతాకు గణేష్ రూ.20 జమ చేశాడు. అయితే కాసేపటికి తన అకౌంట్లో నుంచి రూ.2.50 లక్షలు మాయమయ్యాయి. దీన్ని గుర్తించిన యువకుడు గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.