Eluru: బరితెగించిన కలప స్మగ్లర్లు
ABN , First Publish Date - 2022-04-20T13:58:50+05:30 IST
జిల్లాలోని కుక్కునూరు మండలంలో కలప స్మగ్లర్లు బరితెగించారు.
ఏలూరు: జిల్లాలోని కుక్కునూరు మండలంలో కలప స్మగ్లర్లు బరితెగించారు. బొలెరో వాహనంలో 20 జిట్రేగి దిమ్మెలు తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన జిట్రేగి దిమ్మెల విలువ సుమారుగా లక్ష రూపాయలు ఉంటుందని అంచనా. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్న ఒక అధికారి అండతో కలప అక్రమ రవాణా సాగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ స్మగ్లింగ్ వెహికల్స్ నడుపుతూ దందాకు పాల్పడుతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.