‘వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యకు గ్రూపు తగదాలే కారణం’

ABN , First Publish Date - 2022-05-02T20:14:20+05:30 IST

జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యకు ఆ గ్రామంలో గ్రూపు తగాదాలే కారణమని గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు.

‘వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యకు గ్రూపు తగదాలే కారణం’

ఏలూరు: జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యకు ఆ గ్రామంలో గ్రూపు తగాదాలే కారణమని గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యే అనుచరులే గంజి ప్రసాద్ హత్య చేశారని ఆరోపించారు. పచ్చని పల్లెల్లో రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని ఎమ్మెల్యే తలారి పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేపై దాడి చేసిన ఘటన ఎక్కడ చోటు చేసుకోలేదన్నారు. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేపై తమ పార్టీ వైసీపీ నేతలు దాడి చేస్తే ఆ దాడిలో టీడీపీ వారు ఉన్నారనడం సిగ్గుచేటని ముప్పిడి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2022-05-02T20:14:20+05:30 IST