Eluru: గంజి ప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు

ABN , First Publish Date - 2022-05-04T21:00:57+05:30 IST

గంజి ప్రసాద్ హత్య కేసుకు సంబంధించి మొత్తం 12 మందిపై కేసు నమోదు అయినట్లు ఎస్పీ తెలిపారు.

Eluru: గంజి ప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు

ఏలూరు: జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసుకు సంబంధించి మొత్తం 12 మందిపై కేసు నమోదు అయినట్లు ఎస్పీ రాహుల్‌ దేవ్‌శర్మ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో ప్రధాన నిందితుడు బజారయ్యను అరెస్టు చేసినట్లు చెప్పారు. జి.కొత్తపల్లిలో ఆధిపత్యపోరు వల్లే గంజి ప్రసాద్‌ను హత్య చేశారన్నారు. గత నెల 26న నిందితుడు సురేష్ కత్తులను సేకరించాడని, గంజి ప్రసాద్‌ను హత్య చేయడానికి రెండు రోజులు నిందితుడు నాగార్జున రెక్కీ నిర్వహించాడని తెలిపారు. బజారయ్య ప్రోద్బలంతోనే ముగ్గురు నిందితులు హత్య చేశారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆరుగురిని అరెస్ట్‌ చేశామన్నారు. గంజి ప్రసాద్ హత్యలో మరికొందరి ప్రమేయం ఉందని, విచారణ తర్వాత వారిని కూడా అరెస్ట్‌ చేస్తామని ఎస్పీ రాహుల్‌ దేవ్‌శర్మ తెలిపారు.

Read more