AP News: పెదపాడులో అర్థరాత్రి ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-05-21T13:50:05+05:30 IST
జిల్లాలోని పెదపాడులో అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాత దిమ్మెపై ఎన్టీఆర్ విగ్రహం అభిమానులు ఏర్పాటు చేశారు.
ఏలూరు: జిల్లాలోని పెదపాడులో అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాత దిమ్మెపై ఎన్టీఆర్ విగ్రహాన్ని అభిమానులు ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించేందుకు పోలీసులు యత్నించారు. దీనిపై టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగిస్తున్న పోలీసులను కార్యకర్తలు, అభిమానులు అడ్డుకున్నారు.