పోలీసుస్టేషన్లో చెప్పుకోలేని పరిస్థితులు వుంటాయి: డీఐజీ మోహనరావు
ABN , First Publish Date - 2021-09-08T23:42:18+05:30 IST
గ్రామ స్థాయిలో మహిళలపై జరుగుతున్న గృహ హింస, ఇతర దాడులపై
పశ్చిమ గోదావరి: గ్రామ స్థాయిలో మహిళలపై జరుగుతున్న గృహ హింస, ఇతర దాడులపై పోలీసుస్టేషన్కు వెళ్లి వారు చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయని ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు అన్నారు. జిల్లాలోని జంగారెడ్డిగూడెం ఎసీడీపీఓ కార్యాలయంలో విజిటర్స్ హాల్ను డీఐజీ మోహనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం పోలీసు శాఖను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టామని డీఐజీ తెలిపారు. మహిళలు తమ సమస్యలను సచివాలయాల్లోని మహిళా పోలీసులతో సులభంగా చెప్పుకోగలరని ఆయన అన్నారు. వారికి సత్వర న్యాయం అందించడమే సచివాలయ వ్యవస్థ ముఖ్య ఉద్దేశ్యమని డీఐజీ మోహనరావు అన్నారు.