ఇండియా టు దుబాయ్: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ బంపరాఫర్స్ !

ABN , First Publish Date - 2021-03-11T00:21:10+05:30 IST

భారత్ నుంచి దుబాయ్ వెళ్లే ప్రయాణికులకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తాజాగా బంపరాఫర్స్ ప్రకటించింది.

ఇండియా టు దుబాయ్: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ బంపరాఫర్స్ !

దుబాయ్: భారత్ నుంచి దుబాయ్ వెళ్లే ప్రయాణికులకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తాజాగా బంపరాఫర్స్ ప్రకటించింది. రెండు రాత్రుల ఉచిత హోటల్ బస, ఎలాంటి రుసుము చెల్లించకుండా అదనంగా 10 కిలోల లగేజీ తీసుకెళ్లే వెసులుబాటుతో పాటు విమాన టికెట్ల ధరలలోనూ ప్రత్యేక డిస్కౌంట్స్ ప్రకటించింది. కాగా, ఎకనామీ, బిజినెస్, ఫస్ట్‌క్లాస్ ప్రయాణికులకు వేర్వేరు ఆఫర్లు ఉన్నాయి. దుబాయికి చెందిన ఈ విమానయాన సంస్థ ఇండియా టు దుబాయి ప్రయాణించే వారి కోసం ప్రకటించిన తాజా ఆఫర్లను ఇప్పుడు ఒకసారి చూద్దాం. 


ఎకనామీ క్లాస్ ప్రయాణికులు ఎవరైతే భారత్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ఈ నెల 8 నుంచి 28 మధ్య విమాన టికెట్లు బుక్ చేసుకుంటారో వారికి జేడబ్ల్యూ మారియట్ మార్క్విస్ హోటల్‌లో ఉచితంగా ఒక రాత్రి బస చేసే వెసులుబాటు కల్పించింది. మార్చి 15 నుంచి జూన్ 30 మధ్య వీరు దుబాయ్‌కి వెళ్తే ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు.  అలాగే బిజినెస్ క్లాస్ ప్రయాణికులు కూడా ఇదే టైం పీరియడ్‌లో టికెట్లు బుక్ చేసుకుంటే వారు ఫైవ్ స్టార్ హోటల్‌లో రెండు రాత్రులు ఉచితంగా బస చేయొచ్చు.


ఇక ధరల తగ్గింపు విషయానికి వస్తే.. ఎకనామీ క్లాస్ రూ.17,982, బిజినెస్ క్లాస్ రూ.68,996, ఫస్ట్‌క్లాస్ రూ.1,92,555 ప్రారంభ ధరలుగా నిర్ణయించింది. అలాగే అన్ని క్లాసుల ప్రయాణికులు దుబాయ్ నుంచి భారత్ వచ్చే సమయంలో సాధారణంగా అనుమతించే లగేజీతో పాటు అదనంగా 10 కిలోల లగేజీని తీసుకెళ్లవచ్చు. అంతేగాక కోవిడ్ నేపథ్యంలో ప్రయాణికులందరికీ ఫ్రీ మల్టీ రిస్క్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుందని ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.   

Updated Date - 2021-03-11T00:21:10+05:30 IST