ఎంపీ గోరంట్ల క్షమాపణ చెప్పాలి: కమ్మ సంఘం నాయకులు
ABN , First Publish Date - 2022-08-06T18:31:10+05:30 IST
Anantapuram: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Hindupuram MP Gorantla Madhav) కమ్మ కులాన్ని దూషించడాన్ని నిరసిస్తూ కమ్మ సంఘం నాయకులు భారీ
Anantapuram: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Hindupuram MP Gorantla Madhav) కమ్మ కులాన్ని దూషించడాన్ని నిరసిస్తూ కమ్మ సంఘం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కమ్మ భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టిన ర్యాలీలో కమ్మ సంఘం నాయకులు మాట్లాడుతూ..ఎంపీ గోరంట్ల తక్షణమే కమ్మ కులానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ..అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మహిళలను గౌరవించని ఎంపీ మాధవ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.