సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-01-22T03:51:11+05:30 IST

ఉద్యోగులందరికీ సుప్రీం కోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌ డిమాండ్‌ చేశారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
వడ్డేపల్లి కేజీబీవీ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు

- కస్తూర్బా పాఠశాలల ముందు ఉద్యోగుల నిరసనలు 

    ఇటిక్యాల/రాజోలి, జనవరి 21 : ఉద్యోగులందరికీ సుప్రీం కోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌ డిమాండ్‌ చేశారు. ఎర్రవల్లిలోని కస్తూర్బా బాలికల విద్యాలయం ఉద్యోగులు గురువారం నిరసన తెలిపారు. గోపాల్‌ మాట్లాడుతూ కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, బోధన, బోధనేతర సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం మూడంచల పోరాటం చేస్తున్నామన్నారు. మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు ప్ర సాద్‌, తిమ్మప్ప, శ్రీకాంత్‌, ఎస్‌వో ఆసియా, శేషన్న, రత్నమాల, సావిత్రి పాల్గొన్నారు.


కేజీబీవీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

    రాజోలి:  కేజీబీవీ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల, సీఆర్‌టీ, వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని గురువారం వడ్డేపల్లి కేజీబీవీ పాఠశాల ముందు  మధ్యాహ్న భోజనం విరామం సమయంలో టీఎస్‌యుటీఎఫ్‌ నాయకులు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఈఎస్‌యుటీఎఫ్‌ అధ్యక్షుడు తిప్పన్న మాట్లాడుతూ కేజీబీవీలో పని చేసేవారికి కనీస వేతనం అందించి, వారికి ఉద్యోగ భద్రత కల్పిచాలని డిమాండు చేశారు. భీసన్న, కుమార్‌నాయక్‌,   నాగేష్‌, మాదన్న, శివుడు, దేవేంద్రుడు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-22T03:51:11+05:30 IST