ఉద్యోగుల నిరశన
ABN , First Publish Date - 2022-01-28T05:15:37+05:30 IST
పీఆర్సీ రద్దే మా డిమాండని, ఉద్యోగుల పొట్టపై కొట్టే చీకటి జీవోలు తమకొద్దని పీఆర్సీ ఐక్య వేదిక జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.
భానుగుడి(కాకినాడ),
జనవరి 27: పీఆర్సీ రద్దే మా డిమాండని, ఉద్యోగుల పొట్టపై కొట్టే చీకటి
జీవోలు తమకొద్దని పీఆర్సీ ఐక్య వేదిక జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.
నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం నుంచి రిలే నిరాహార దీక్షలు
ప్రారంభమయ్యాయి. కాకినాడ ధర్నా చౌక్ వద్ద దీక్షలు ప్రారంభించారు. ఈ
కార్యక్రమాన్ని ఏపీ జేఏసీ చైర్మన్ గుద్దాటి రామ్మోహన్రావు, ఏపీ జేఏసీ
చైర్మన్ పితాని త్రినాథ్, గెజిటెడ్ సంఘం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
దుర్గాప్రసాద్, గవర్నమెంట్ అసోసియేషన్ చైర్మన్ జగన్నాథం, ఏపీఎన్జీవో
రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసు, సెక్రటరీ పాలపర్తి మూర్తిబాబు
కార్యక్రమాన్ని ప్రార ంభించారు. మొదటిరోజు 300 మందికి పైగా ఉద్యోగులు
నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ
ఉద్యోగులకు నష్టం కలిగించే నిర్ణయాలను తీసుకుంటూ ఉద్యోగులను
వేధిస్తున్నారని విమ ర్శించారు. అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలను తక్షణం
రద్దు చేయాలని, మెరుగైన జీవోలను విడుదల చేసి ఉద్యోగులను ఆదుకోవాలని
డిమాండ్ చేశారు. రివర్స్ పీఆర్సీని ఒప్పుకునేది లేదని ఈ సందర్భంగా
తెలిపారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్
విధానాన్ని రద్దు చేయాలని, కాంట్రాక్టు ఎంప్లాయీస్ను రెగ్యులర్
చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులకు నూతన పేస్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని కోరారు. ప్రభుత్వం తమ న్యాయమైన
డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమం ఆపేది లేదని ఉద్యోగ సంఘాల నాయకులు
తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
సంసాని శ్రీనివాసరావు, పీఈటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లంక జార్జ్,
సీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రవి, ఎస్టీయూ రాష్ట్ర కోశాధికారి
సుబ్బరాజు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు టి.చక్రవర్తి, ఏపీటీఎఫ్ జిల్లా
అధ్యక్షుడు సుబ్రహ్మణం, ఫ్యాప్టో జిల్లా చైర్మన్ చేకూరి రవి, పీఆర్టీయూ
జిల్లా అధ్యక్షుడు తిలక్బాబు, బహుజన్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా
అధ్యక్షుడు శరత్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సత్తిబాబు, పాము శ్రీను,
రమేష్, నాలుగో తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు సత్తిబాబు, విజువల్లీ
చాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బారావు, ఏపీ ఎన్జీవో
సంఘం జిల్లా నాయకులు తిరగడి వెంకటరమణ, సరెళ్ల చంద్రరావు, ఈరంకి నారాయణ
తదితరులు పాల్గొన్నారు.