ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలి

ABN , First Publish Date - 2022-05-21T06:24:38+05:30 IST

ప్రభుత్వోద్యోగులు నిబద్దతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ బసంతకుమార్‌ పేర్కొన్నారు.

ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలి
జిల్లా రిజిసా్ట్రర్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ బసంతకుమార్‌

కలెక్టర్‌ బసంతకుమార్‌

పుట్టపర్తి, మే 20: ప్రభుత్వోద్యోగులు నిబద్దతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ బసంతకుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ సమీపాన జిల్లా రిజిసా్ట్రర్‌ కార్యాలయం, జిల్లా ఆహార భద్రత శాఖ కార్యాలయాలను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వోద్యోగులు విధి నిర్వహణలో మమేకమై, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. అవినీతికి తావులేకుండా పనిచేసి, ప్రజల మన్ననలు పొందాలన్నారు. జిల్లా కేంద్రంలో సుమారు 15 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ ప్రభుత్వ శాఖల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల డీఐజీ మాధవి, ఆర్డీఓ భాగ్యరేఖ, జిల్లా రిజిసా్ట్రర్‌ రవివర్మ, పుడా వైస్‌చైర్మన నరే్‌షకృష్ణ, జిల్లా ఆహార భద్రత అధికారి రామచంద్ర, ఎఫ్‌ఎ్‌సఓ తస్లీమా పాల్గొన్నారు.


Updated Date - 2022-05-21T06:24:38+05:30 IST