ఉద్యోగుల అపోహలు తొలగించేందుకే చర్చలకు రమ్మంటున్నాం: బొత్స
ABN , First Publish Date - 2022-01-31T21:36:58+05:30 IST
ఉద్యోగుల అపోహలు తొలగించేందుకే చర్చలకు రమ్మంటున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
అమరావతి: ఉద్యోగుల అపోహలు తొలగించేందుకే చర్చలకు రమ్మంటున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అపోహలు తొలగించడానికే మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. అసలు నేతలు రాకుండా సెకండ్ స్థాయి నేతలు వచ్చి.. మూడు అంశాలపై తమకు లేఖ ఇచ్చారని పేర్కొన్నారు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఈ నెల జీతాల ప్రాసెస్ జరుగుతుందని తెలిపారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అంటున్న సంఘాలు.. ట్రెజరీ ఉద్యోగుల్ని పనిచేయొద్దు అంటున్నారని తప్పుబట్టారు. జీతాల విషయంలో ఈ ద్వంద్వ వైఖరి ఏంటి..? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.