అమరావతికి ఉద్యోగులు మద్దతివ్వాలి

ABN , First Publish Date - 2022-01-07T06:17:09+05:30 IST

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారి నెల నెలా ఉద్యోగుల జీతాలకే అప్పు చేయవలసిన దుస్థితి నెలకొంది. వారి జీతాలు పెంచడం అసాధ్యంగా కనబడుతున్న నేపథ్యంలో మూడు రాజధానులు సాధ్యమా...

అమరావతికి ఉద్యోగులు మద్దతివ్వాలి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారి నెల నెలా ఉద్యోగుల జీతాలకే అప్పు చేయవలసిన దుస్థితి నెలకొంది. వారి జీతాలు పెంచడం అసాధ్యంగా కనబడుతున్న నేపథ్యంలో మూడు రాజధానులు సాధ్యమా? ఒకవేళ కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించే పక్షంలో ఉద్యోగులకు మరిన్ని కష్టాలు తప్పవు. మూడు రాజధానుల ప్రతిపాదన ప్రజలపై మోయలేని భారమే కాకుండా పాలనాపరంగా అనేక ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగుల విధి నిర్వహణ సంక్లిష్టం అవుతుంది. హైకోర్టు కర్నూలులో ఉంటే, ఉద్యోగులు తరుచూ కోర్టు పనులపై విశాఖ నుంచి కర్నూలు వెళ్ళటానికి ఎన్నో వ్యయ ప్రయాసలనెదుర్కోవాలి. ఆచరణలో ఇలాంటి సమస్యలు కోకొల్లలు. కాబట్టి ప్రభుత్వోద్యోగులు అమరావతే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ముక్తకంఠంతో కోరాలి.

గరిమెళ్ళ రామకృష్ణ, ఏలూరు

Updated Date - 2022-01-07T06:17:09+05:30 IST