బ్యాంకు అభివృద్ధికి ఉద్యోగులు కృషి చేయాలి
ABN , First Publish Date - 2022-08-19T05:54:53+05:30 IST
కొత్తగా విధుల్లో చేరిన ఉద్యోగులు బ్యాంకు అభివృద్ధి కోసం తోడ్పాటును అందించాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు.
నల్లగొండ, ఆగస్టు 18: కొత్తగా విధుల్లో చేరిన ఉద్యోగులు బ్యాంకు అభివృద్ధి కోసం తోడ్పాటును అందించాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి ఉద్యోగులకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం వారికి ఆర్డర్స్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 2022 రిక్రూట్మెంట్లో భాగంగా ఫిబ్రవరి 19వ తేదీన నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. జూలై 9న జరిగిన ఆన్లైన్ పరీక్షల్లో ఎంపికైన తొమ్మిదిమంది అసిస్టెంట్ మేనేజర్లకు, 19 మంది స్టాఫ్అసిస్టెంట్లకు అపాయింట్మెంట్ ఉత్తర్వులు అందజేశామన్నారు. నూతన ఉద్యోగులకు దిశా-నిర్ధేశం చేశారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్రెడ్డి, డైరెక్టర్లు కుంభం శ్రీనివా్సరెడ్డి, పాశం సంపత్రెడ్డి, ప్రొఫెషనల్ డైరెక్టర్ గిరిధర్, సీఈవో కె.మదనమోహన్, జీఎం వసంతరావు, డీజీఎం, ఏజీఎం పాల్గొన్నారు.