GPF ఖాతాల్లో రూ.800 కోట్లు మాయంపై ఉద్యోగ సంఘాల స్పందన

ABN , First Publish Date - 2022-06-29T18:29:26+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో నుంచి రూ.కోట్లు మాయం అయ్యాయని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.

GPF ఖాతాల్లో రూ.800 కోట్లు మాయంపై ఉద్యోగ సంఘాల స్పందన

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో నుంచి రూ. 800 కోట్లు మాయం అయ్యాయని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. బుధవారం ఏబీఎన్‌తో ఉద్యోగ సంఘాలు మాట్లాడుతూ.. జీపీఎఫ్ స్లిప్పులు మంగళవారం రావడంతో.. ఖాతాల్లో నుంచి డబ్బులు డెబిట్ అయినట్టు చూసుకున్నామని... దీంతో ఉద్యోగ వర్గాల్లో గందరగోళం ఏర్పడిందన్నారు. ఆరు నెలలుగా ఇచ్చిన డీఏ ఏరియర్స్‌ను ప్రభుత్వం వెనక్కి తీసేసుకుందని మండిపడ్డారు. ఎన్జీవో అసోసియేషన్ గ్రూపుల్లో జీపీఎఫ్ స్లిప్పులు పోస్ట్ చేస్తున్నారని తెలిపారు. దీనిపై ఆర్థిక శాఖ, సీఎస్ దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. 

Updated Date - 2022-06-29T18:29:26+05:30 IST