కలెక్టర్ను సన్మానించిన ఉద్యోగులు
ABN , First Publish Date - 2021-03-09T04:49:33+05:30 IST
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవా రం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ యాస్మిన్ బాషను జిల్లా మహిళ రెవెన్యూ ఉద్యోగులు, కలెక్టరేట్ సిబ్బంది శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
వనపర్తి అర్బన్, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవా రం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ యాస్మిన్ బాషను జిల్లా మహిళ రెవెన్యూ ఉద్యోగులు, కలెక్టరేట్ సిబ్బంది శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ముందుగా కేక్ కట్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందంజ లో ఉండాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో అమరేందర్, ఎస్డీసీ, మహిళా ఉద్యోగులు, రెవెన్యూ సిబ్బంది, ట్రెస్పా జిల్లా అధ్యక్షుడు మళ్లికార్జున్, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.