కలెక్టర్‌ను సన్మానించిన ఉద్యోగులు

ABN , First Publish Date - 2021-03-09T04:49:33+05:30 IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవా రం కలెక్టర్‌ చాంబర్‌లో కలెక్టర్‌ యాస్మిన్‌ బాషను జిల్లా మహిళ రెవెన్యూ ఉద్యోగులు, కలెక్టరేట్‌ సిబ్బంది శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

కలెక్టర్‌ను సన్మానించిన ఉద్యోగులు
కేక్‌ కట్‌ చేస్తున్న కలెక్టర్‌, అధికారులు

వనపర్తి అర్బన్‌, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవా రం కలెక్టర్‌ చాంబర్‌లో కలెక్టర్‌ యాస్మిన్‌ బాషను జిల్లా మహిళ రెవెన్యూ ఉద్యోగులు, కలెక్టరేట్‌ సిబ్బంది శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ముందుగా కేక్‌ కట్‌చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందంజ లో ఉండాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, ఆర్డీవో అమరేందర్‌, ఎస్‌డీసీ, మహిళా ఉద్యోగులు, రెవెన్యూ సిబ్బంది, ట్రెస్పా జిల్లా అధ్యక్షుడు మళ్లికార్జున్‌, తహసీల్దార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T04:49:33+05:30 IST