వైసీపీ ప్రభుత్వానికి త్వరలోనే ఉద్యోగులు బుద్ధి చెబుతారు: అశోక్బాబు
ABN , First Publish Date - 2022-01-08T02:06:03+05:30 IST
వైసీపీ ప్రభుత్వానికి త్వరలోనే ఉద్యోగులు బుద్ధి చెబుతారు: అశోక్బాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వానికి త్వరలోనే ఉద్యోగులు బుద్ధి చెబుతారని అశోక్బాబు మండిపడ్డారు. పే రివిజన్ కమిషన్ కాదు.. పే రివర్స్ కమిషన్ అని అశోక్బాబు విమర్శించారు. 27 శాతం ఐఆర్ ఇచ్చాక ఫిట్మెంట్ ఏ మాత్రం తగ్గినా.. జీతాలు తగ్గుతాయనే విచక్షణా జ్ఞానం ప్రభుత్వానికి లేదని అశోక్బాబు అన్నారు. ఈ పీఆర్సీతో రిటైర్డ్ అవ్వబోయే ఉద్యోగులకి నష్టం జరుగుతుందని, పీఆర్సీతో ఉద్యోగులకు రూపాయి కూడా బెనిఫిట్ లేదని ఎమ్మెల్సీ అశోక్బాబు పేర్కొన్నారు. ఈ పీఆర్సీ, ఫిట్మెంట్ ప్రకటన నయవంచనే తప్ప మరొకటి కాదని అశోక్బాబు అన్నారు.